స్వతంత్ర వెబ్ డెస్క్: మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది మాత్రం బీజేపీకే అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మైనారిటీ ఏరియాలో ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం జరిగింది. 75 ఏళ్లలో మైనార్టీలకు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల వల్ల లాభం చేకూరలేదు. బిజెపి మాత్రమే మైనార్టీలకు గుర్తింపు ఇచ్చిందన్నారు.
తాను పార్లమెంటు సమావేశాల్లో ఉన్నప్పుడు కావాలనే కేటీఆర్ నిజామాబాద్ లో పర్యటించారు. జిల్లాలో మైనార్టీల అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం వాటా 60 శాతంపైగా ఉందని వెల్లడించారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారు.. అందుకే 2 చోట్ల పోటీకి సిద్ధం అయ్యారు.. కేసీఆర్ ఓడిపోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కెటిఆర్ ని బుడబుక్కలోడు అన్నాను.. అందుకు చింతిస్తున్న.. తనకు బుడబుక్కల అనే సమాజం ఉందని తెలియదు అన్నారు ఎంపీ అరవింద్.