వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. పులివెందులలోని వైసీపీ కార్యకర్తలు, అవినాశ్ అనుచరులు తనను అనుసరిస్తున్నారని.. వారి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భాస్కరరెడ్డి అరెస్టు తర్వాత తనపై కక్ష కట్టారని తెలిపారు. అయితే ఆఫీసులో ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. తనకు ఏమైనా జరిగితే అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ దే బాధ్యతని వెల్లడించారు. తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలుకెళ్లేందుకు సిద్ధమని.. లేదంటే తన పదవికి అవినాశ్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.
ప్రాణహాని ఉందని కడప జిల్లా ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు
0
536
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


