Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ నెల 6న తెలంగాణలో జనజాతర సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభతో తమ పార్టీలో జోష్ వచ్చిందని, ఏప్రిల్ ఆరో తేదీన నిర్వహించనున్న సభ సైతం తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ ఈ సభను విజయవంతం చేసే బాధ్యతను పలువురు నాయకులకు అప్పగించారు. ఈ నెల 6న తెలంగాణలో జనజాతర పేరిట కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ కి ప్రత్యేకమని, రాష్ట్రానికి సోనియాగాంధీ కుటుంబం సైతం ఎంతో ప్రత్యేకమని రేవంత్ తెలిపారు. తెలంగాణలో 14 స్థానాలు గెలిపించి సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపాలని రేవంత్ పిలుపునిచ్చారు. 2023 సెప్టెంబర్ 17 న ఆరు గ్యారంటీలను సోనియాగాంధీ విడుదల చేశారనీ, ఆమెపై అభిమానంతో ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని రేవంత్ గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందనీ,మిగతా హామీలను ఎన్నికల కోడ్ తరువాత వందశాతం అమలు చేస్తామని రేవంత్ తెలిపారు.

జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణలో విడుదల చేసుకోబోతున్నామని, జాతీయ కార్యాచరణకు ఇక్కడి నుంచే పిలుపునివ్వడంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ కార్యకర్తల కష్టాన్ని గుర్తించిందని రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు రాష్ర్టం నలుమూలల నుంచి జనజాతర సభకు తరలి రావాలని, మరి ముఖ్యంగా ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలి వచ్చి ఆశీర్వదించమని రేవంత్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పొలం బాట పట్టడంపైన, పదేళ్ల తరువాతనైనా తెలంగాణలో రైతులున్నారని కేసీఆర్ కు గుర్తురావడంపైన తనకు సంతోషంగా ఉందని సీఏం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చింది అని కేసీఆర్ అనడం దుర్మార్గమని రేవంత్ అన్నారు. కేసీఆర్ పాపాలకు వరుణ దేవుడు కూడా భయపడి పారిపోయాడని అందుకే గత సంవత్సరం సరిగా వర్షాలు కురవలేదని రేవంత్ విమర్శించారు. 64లక్షల 75 వేల 581 మంది రైతు ఖాతాల్లో ప్రభుత్వం రైతు బంధు వేసిందనీ, మిగిలిన వారికి ఎన్నికల కోడ్ ముగియగానే రైతు బంధు చెల్లిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. తాము చెప్తున్న లెక్కలు తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు.

కేసీఆర్ పర్యటించిన రోజు సూర్యాపేటలో 30 సెకన్లు సైతం కరెంటు పోలేదనీ, సూర్యాపేట ప్రెస్ మీట్ జనరేటర్ తో నడిచిందని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి ఉంటే కేసీఆర్ చేసిన పాపం కొంతైనా తగ్గేదని రేవంత్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్ నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారని రేవంత్ అరోపించారు. ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూసి కేసీఆర్ నిప్పులు పోసుకుంటున్నారని, కేసీఆర్ పర్యటన చూస్తోంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధ యాత్రలకు వెళ్లినట్లుందని సీఏం ఎద్దేవా చేశారు. కేసీఆర్ రద్దైన వెయ్యి రూపాయల నోటు లాంటి వారని ఆయన విమర్శించారు. ప్రతీ వారం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నెరవేర్చాలని అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9 న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని రేవంత్ ఆహ్వానం సైతం అందజేసేశారు. తాను బీఆర్ఎస్ నాయకుల లాగా ఫామ్ హౌస్ లోనో, సినిమా వాళ్ల గెస్ట్ హౌసుల్లోనో పడుకోవడంలేదని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 200 మంది రైతులు చనిపోయారని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ తిప్పికొట్టారు. కేసీఆర్ కు 48 గంటల సమయం ఇస్తున్నామని, చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలని సీఏం తెలిపారు. నిజంగా రైతులు చనిపోయి ఉంటే వారిని ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ తెలిపారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్