టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తాడిపత్రిలో బహిరంగ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ.. చంద్ర బాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోతారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలు అన్నీ ఆగిపోతాయని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అన్నారు. అంతేకాదు.. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖని నిద్రలేపడమే అన్నారు. తనను ఒక్కడిని చేసి అందరూ మూటగట్టుకొని వస్తున్నారని జగన్ అన్నారు. 58 నెలల పాలనలో ఎక్కడా వివక్ష లేదు, లంచాలు లేవు అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో మాట్లాడే పిల్లలు కూడా అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని అన్నారు. గ్రామాల్లోనే అన్ని సేవలు అందేలా చేశామని సీఎం జగన్ చెప్పారు.