ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని తెలంగాణ చౌరస్తాలో పటాసులు కాల్చి, సీట్లు పంపిణీ చేసి బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి హాజరయ్యారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన కొమురయ్యకి సంజీవరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ఉపాధ్యాయ లోకంలో బీజేపీపై ఉన్న అపారమైన విశ్వాసం, నమ్మకం మరింత బలపడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అధిక స్థానాలు గెలుస్తుందన్నారాయన.
సుల్తానాబాద్ తెలంగాణ చౌరస్తాలో బీజేపీ శ్రేణుల సంబరాలు
Latest Articles
- Advertisement -