29.6 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

బీజేపీ నేతలను ఏపీలో ఎదగనివ్వడం లేదు: సోము వీర్రాజు

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు ఉందా?లేదా? అనే దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. జనసేనతో పొత్తుపై బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు జనసేన నుంచి ఎంత సహకారం అందిందో ప్రజలే ఆలోచించాలని తెలిపారు. కేంద్రంలోని మోదీని పొగుడుతారని.. రాష్ట్రంలో మాత్రం బీజేపీ నేతలను ఎదగనివ్వరని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ-జనసేన పొత్తు ఉండకూడదని కొంతమంది కోరుకుంటున్నారని.. వారి కోరిక ఎప్పటికీ ఫలించదని స్పష్టంచేశారు. కాగా బీజేపీ తమతో కలిసి రావడం లేదని ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత మాధవ్ జనసేననే తమతో కలిసి రావడం లేదని కౌంటర్ ఇచ్చారు. దీంతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా?లేదా? అనే చర్చ మొదలైంది.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్