39.4 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

Delhi liquor scam: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో బిగ్ రిలీఫ్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై కవిత సుప్రీంను ఆశ్రయించగా ఆమె పిటీషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అంతేకాదు.. కవిత పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించవచ్చా అనే అంశాన్ని పిటీషన్ లో పేర్కొన్నారని..ఆ అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కవిత పిటీషన్ పై ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. ఆ తరువాత రెండు వారాల్లో రిజోఇండర్ పిటీషన్ ను దాఖలు చేయాలని కోర్టు కవితకు సూచించారు.

 

కవిత పిటీషన్ ను విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ దీనిని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అయితే కవిత పిటీషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకోవడం..ఆమె అభ్యర్థిత్వంపై కోర్టు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు ఊరట లభించినట్లయింది.  కాగా కవిత తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి తమ వాదనలను వినిపించారు. మరి తదుపరి విచారణ సమయానికి ఈడీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా..అలా జరిగితే కవిత రిజోఇండర్ పిటీషన్ వేయాల్సి వస్తుంది.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్