స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జీ కూలిపోయింది. ఒడిశాలోని అస్కా నుంచి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 70 టన్నుల గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ వెళుతోంది. భారీ వాహనాలు జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉండగా.. లారీ డ్రైవర్ మాత్రం ఇచ్ఛాపురం పట్టణంలోకి వచ్చాడు. ఈ క్రమంలో లారీ బాహుదా నది వంతెనపైకి రాగానే ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీ కిందికి పడిపోయింది. నదిలో నీరు లేకపోవడం, ఇతర వాహనాలు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్కు మాత్రం స్వల్పగాయాలయ్యాయి. వంతెన కూలిపోవడంతో ఇచ్ఛాపురం పట్టణంలోకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 1929లో బాహుదా నదిపై ఈ వంతెనను బ్రిటీష్ పాలకులు నిర్మించారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కూలిన పురాతన వంతెన
0
550
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


