స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. అనేక వాదోపవాదనలు అనంతరం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత తీర్పు వస్తుందని భావించినా, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో… ఈరోజు సీబీఐ వాదనలు ఎక్కువగా వినిపించేందుకు అవకాశం దక్కలేదు. సమయం లేని కారణంగా శనివారం సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పిలుపునిచ్చింది. దీంతో అవినాశ్ ముందస్తు బెయిల్ పై ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా
0
339
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


