తిరుపతి వైసీపీ అభ్యర్థి కరుణాకర్రెడ్డిపై కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. తాము గెలిచాక ఆయన అవినీతిపై విచారణ చేపడతామని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. 2012లో చిరంజీవి బస చేసిన హోటల్ వద్ద రౌడీలతో హల్చల్ చేసిన ఘనత ఆయనదని దుయ్యబట్టారు. కరుణాకర్ రెడ్డి మాటలను ఈసారి తిరుపతి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.