26.7 C
Hyderabad
Saturday, June 10, 2023

Jagan Delhi Tour |నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ఆ కేంద్రమంత్రితో ప్రత్యేక సమావేశం..

Jagan Delhi Tour |ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించిన విషయం తెలిసిందే. రెండు వారాల వ్యవధిలో మరోసారి జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన అంశంపై కేంద్ర హోంమంత్రితో చర్చించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి పర్యటన(Jagan Delhi Tour)లో అజెండా ఏమిటి.. ఏయే అంశాలపై కేంద్ర హోమంత్రిని కలవనున్నారనే దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను నివేదించడానికే జగన్ ఢిల్లీ పర్యటన అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాని రెండు వారాల వ్యవధిలో రెండోసారి ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటనకు వెళ్లనుండటంపై ఏపీ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

Read Also:  రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై కేటీఆర్ రూ.100కోట్ల పరువునష్టం దావా

Follow us on:   YoutubeInstagramGoogle News

Latest Articles

నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

స్వతంత్ర వెబ్ డెస్క్: మేషం ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్