లిక్కర్‌ కేసులో మళ్లీ కదలికలు.. కేజ్రీవాల్‌, సిసోడియాకు కొత్త చిక్కులు

ఢిల్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ పాలసీ కేసు మళ్లీ ముందుకు కదిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

లిక్కర్‌ పాలసీ మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రిని విచారణ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చింది. ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై కేసుకు సంబంధించి ఏజెన్సీ ప్రాసిక్యూషన్ ముందుకు వెళ్లేందుకు కూడా హోం మంత్రిత్వ శాఖ అంగీకరించిందని తెలిసింది.

ప్రజా ప్రతినిధులను విచారించాలంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ వంటి సంస్థలకు ముందస్తు అనుమతి అవసరమని గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు అనంతరం కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో వచ్చిన ఆరోపణల్లో కేజ్రీవాల్ సూత్రధారి అని ఈడీ చెప్పినప్పటికీ, క్లియరెన్స్ లేనందున అభియోగాల రూపకల్పన ఢిల్లీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. తాజా పరిణామం ఇప్పుడు ఆ అడ్డంకిని తొలగించింది.

అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన వారాల తర్వాత, తనపై ఉన్న చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనే ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రాసిక్యూట్ చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుమతి లేదని ఆయన అన్నారు.

కేజ్రీవాల్, సిసోడియా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులలో అరెస్టయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ బెయిల్‌పై ఉన్నారు. ఇద్దరు నేతలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి బీజేపీ.. దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుంటోందని ఆరోపించారు..

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు కేజ్రీవాల్‌, సిసోడియా ..ఇద్దరు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. రాజకీయంగా, తాజా పరిణామం ఎన్నికలకు ముందు అధికార ఆప్‌పై బిజెపి దాడులకు పదును పెట్టే అవకాశం ఉంది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్