కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల నుంచి తెల్లరేషన్కార్డులు మంజూరు చేయలేదని అన్నారు. రుణమాఫీ కావాలంటే తెల్లరేషన్కార్డు ఉండాలని నిబంధన పెట్టారని మండిపడ్డారు. రేషన్కార్డులకు దరఖాస్తులు తీసుకొని 7 నెలలయినా మంజూరు చేయలేదని ఈటల విమర్శించారు. నిబంధనలు ప్రకారం దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారని ఈటల ఫైర్ అయ్యారు.