పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాదలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ తమ పొలాల నుండి వేయొద్దని రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొలాల నుండి పైప్లైన్ వేయొద్దని పదేళ్లుగా రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులు పోలీసు భద్రత కోరారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను అరెస్టు చేసి, ప్రైవేటు వాహనంలో తరలించారు . రైతుల పట్ల వ్యవహరించిన తీరుపై రైతు సంఘం నేతలు మండిపడ్డారు. తమ పొలాల నుండి పైప్ లైన్లు వేయనివ్వం అని రైతులు స్పష్టం చేశారు.
రుస్తుంబాదలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి
0
144
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


