కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ, టీడీపీ మధ్య వర్గ విబేధాలు బట్టబయలయ్యాయి. టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి బీజేపీ శ్రేణులను దూరం పెడుతూ.. అవమానప రుస్తున్నారని బహిరంగగానే విమర్శలు గుప్పించారు బీజేపీ నేత పురుషోత్తంరెడ్డి. పొత్తు ధర్మం పాటించ డంలేదని ఫైర్ అయ్యారు. బాలకృష్ణ బస్సుయాత్రకు తమకు ఆహ్వానం లేదని.. పైన ఏన్డయే తో పొత్తు పెట్టుకుని కింది స్థాయిలో అవమానించడం భావ్యంకాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ అధిష్టానా నికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన ఆయన.. పరిస్థితి ఇలాగే ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని టీడీపీ నేతలను హెచ్చరించారు.