మోదీని చంపేస్తామని బెదిరింపులు.. కేరళలో హైఅలర్ట్

ప్రధాని మోదీ కేరళకు వస్తే చంపేస్తామని బెదిరింపులు రావడం సంచలనం రేపుతోంది. ఈనెల 24న మోదీ కేరళ పర్యటన నేపథ్యంలో ఆత్మహుతి దాడులకు పాల్పడతామని గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు హైఅలర్ట్ ప్రకటించారు.

ఈ బెదిరింపు లేఖ గత వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ లేఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ ఏడీజీపీకి ఫిర్యాదుచేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రధాని భద్రతకు సంబంధించిన ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు లీక్ అయ్యాయి.

ఉత్తర్వులు లీక్ కావడంపై కేరళ బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి ఎం.మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన భద్రతా లోపమని మండిపడ్డారు. అయితే షెడ్యూల్ ప్రకారమే ప్రధాని పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్