హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు వీరు ముగ్గురిని కలిపి అధికారులు విచారించారు. వివేకా హత్య కేసులో రూ.40కోట్ల డీల్ జరిగిందన్న ఆరోపణలపై వారిని ప్రశ్నించారు. నిందితుడు సునీల్ యాదవ్ కు రూ.కోటి ఎవరు బదిలీ చేశారని ఆరా తీశారు. అలాగే హత్య జరిగిన రోజు నిందితులు మీ ఇంట్లో ఎందుకు ఉన్నారని కూడా విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం భాస్కరరెడ్డి, ఉదయ్ లను చంచల్ గూడ జైలుకు తరలించారు. భాస్కరరెడ్డికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జైలులో చికిత్స అందించనున్నారు. తిరిగి రేపు ఉదయం 10.30గంటలకు మళ్లీ వీరిని విచారించనున్నారు.
ముగిసిన అవినాశ్ రెడ్డి, భాస్కరరెడ్డి, ఉదయ్ రెడ్డిల సీబీఐ విచారణ
0
289
Previous article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


