బీఆర్ఎస్ వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోలేదు: బొత్స

విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanaryana)స్పష్టంచేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనేది మా నినాదమన్నారు. ప్రైవేటీకరణ ఆపాలని తాము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్(BRS)పార్టీ వల్లే ప్రైవేటీకరణ తాత్కాలికంగా ఆగిపోయిందనే ప్రచారంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, జనసేన(Janasena)పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

అలాగే కోడికత్తి(Kodikathi)కేసుకు సంబంధించిన NIA రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. 2003లో అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేయడం వెనక కూడా రాజకీయ లబ్ధి ఉందా? అని ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాస్ వెనక ఎవరున్నారో తేలాలని.. ఈ కేసులో సమగ్ర విచారణ జరగాలన్నదే వైసీపీ డిమాండ్ అన్నారు బొత్స.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్