సొంత తమ్ముడే తనపై విషప్రయోగం చేశాడు.. నటుడు సంచలన వ్యాఖ్యలు

కిడ్నీ సంబంధిత సమస్య నుంచి కోలుకుంటున్న తమిళ నటుడు పొన్నంబాలం(Ponnambalam) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వల్లే తన కిడ్నీలు పాడయ్యాయనే వార్తలపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన తమ్ముడి వల్లే కిడ్నీలు పాడైపోయాయని షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన తండ్రికి నలుగురు భార్యలని.. అందులో మూడవ భార్య కొడుకుని సొంత తమ్ముడిగా భావించిన మేనేజర్ గా పెట్టుకున్నానని తెలిపారు. తన సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు తనే చూసుకునేవాడన్నారు. అయితే ఒకసారి తాను తాగే బీరులో స్లో పాయిజన్ కలిపాడని.. అంతేకాకుండా కొన్నిసార్లు తినే ఆహారంలో కూడా విషం కలిపేవాడని పేర్కొన్నాడు. దీంతో తన కిడ్నీలు పాడైపోయాయని.. వైద్యులను సంప్రదిస్తే విషప్రయోగం వల్లే ఇలా జరిగిందని చెప్పారన్నారు.

కాగా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న తనకు చికిత్స కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని సమయంలో చిరంజీవి గారు గుర్తుకు వచ్చారని పొన్నంబలం(Ponnambalam) తెలిపాడు. ఆయనకు ఫోన్ చేసి తన సమస్య గురించి చెప్పి సాయం చేయమని అడిగానన్నారు. లక్ష, రెండు లక్షలు హెల్ప్‌ చేస్తారని అనుకున్నానని.. కానీ మరో ఐదు నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలో జాయిన్ అవ్వమన్నారని తెలిపారు. ఆ హాస్పిటల్‌లో ఎంట్రీ ఫీస్‌ కూడా అడగలేదని.. మొత్తం బిల్లు 40లక్షలు అయిందని.. చిరంజీవి గారే అంతా చూసుకున్నారని పొన్నంబలం వెల్లడించాడు.

Read Also: రాంచరణ్ కు మరో అరుదైన గౌరవం.. చెర్రీని సన్మానించనున్న ప్రధాని మోదీ

Follow us on:   Youtube   Instagram

Latest Articles

అల్వాల్‌లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్‌ సీజ్‌

అల్వాల్‌లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్‌లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్