రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. వర్షాకాలంలో కూడా పనులకు ఆటంకం లేకుండా జరుగుతున్నాయని ఇంజినీర్లు వివరించారు. ఇప్పటికే పరిపాలన అనుమతులు పొందిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారంపై మంత్రి చర్చించారు. రైతుల ఎల్పీఎస్ ప్లాట్ ల అభివృద్ధి, గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన పనుల పురోగతిపైనా చర్చించారు. వీలైనంత త్వరగా అధికారులు, ఉద్యోగుల నివాసాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి సూచించారు.
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
0
24
Previous article
Latest Articles
ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం
ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించారు. జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా జనసైనికుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పార్టీ నిర్మాణ సారధుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు ఎమ్మెల్యే...
- Advertisement -
- Advertisement -


