తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి గవర్నర్ను కలిసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. పుదుచ్చేరి క్యాంప్ నుంచి చెన్నై రావాలని ఎమ్మెల్యేలకు ఆదేశించారు. రాత్రిక్యాంపులో పళనిస్వామి ఎమ్మెల్యేలను కలిశారు.గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి కోరనున్నారు. అవసరమైన మద్దతు ఉందని అన్నాడీఎంకే అంటోంది. అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే రెడీ అవుతోంది. విజయ్కి ఎట్టిపరిస్థితుల్లో అధికారం దక్కకూడదని పంతం పట్టారు.పళనిస్వామి సీఎం అయినా పర్వాలేదని ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. హంగ్ ఫలితం వచ్చినప్పటి నుంచే డీఎంకే-అన్నాడీఎంకే మంతనాలు ప్రారంభించారు. తనకు డీఎంకే సపోర్టు చేస్తోందని పార్టీ ఎమ్మెల్యేలకు పళనిస్వామి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తానే సీఎం అవుతానని విజయ్వైపు వెళ్లొద్దని పళనిస్వామి చెప్పడంతో వేరు కుంపటికి సిద్ధమై మళ్లీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వెనక్కితగ్గారు.
మరోవైపు విజయ్ సైతం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రెండు కలిస్తే రాజీనామాలకు సిద్ధమనే సంకేతాలు పంపించారు. 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని విజయ్ చెబుతున్నారు. ఇంకోవైపు 118 మార్క్ను చూపించే వారికే అవకాశం ఇస్తానని గవర్నర్ అర్లేకర్ అంటున్నారు.సరైన సంఖ్యాబలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరు ముందుకొచ్చినా..సరే అని తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ప్రకటించారు.


