తమిళనాడు పొలిటికల్ లీగ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. టీవీకే విజయ్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు తిప్పలు తప్పట్లేదు. మెజారిటీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో భగ్గుమన్న టీవీకే, కాంగ్రెస్ శ్రేణులు చెన్నైలో నిరసనలకు దిగాయి. లోక్భవన్ పరిసరాల్లో టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు ఆందోళనలు చేపట్టారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తాము చెన్నైలోనే ఉంటామని తిరుప్పూర్ వంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు చెప్పారు. చెన్నైలోని మెరీనా బీచ్తో పాటు పలు కీలక ప్రాంతాల్లో టీవీకే మద్దతుదారులు ఆందోళనలకు సిద్ధమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనల నేపథ్యంలో చెన్నైలో, అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.


