తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు జల్లికట్టు ప్రొటెస్ట్ (2017 Jallikattu protests) తరహాలో చెన్నైలోని మెరీనా బీచ్( Marina Beach) వద్ద భారీ నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తున్నారు. “విజయ్కు న్యాయం చేయాలి”, “ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి” వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టులపై తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పర్యవేక్షణ పెంచినట్లు సమాచారం. ముఖ్యంగా మెరీనా బీచ్ పరిసరాల్లో పరిస్థితిని గమనిస్తూ, ప్రజలను వదంతులు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.


