మే నెల నుంచి ‘అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగిన రైతులందరికీ 20 వేల రూపాయల నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధివిధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు. రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని..కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రలో భారీ అవినీతి జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
మే నుంచి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం – మంత్రి అచ్చెన్నాయుడు
0
296
Previous article
Next article
Latest Articles
వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే
ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
- Advertisement -
- Advertisement -


