30.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

రంభ రీ ఎంట్రీ

90లలో సిల్వన్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసిన అందాల భామ రంభ. కమర్షియల్‌ ట్రెండ్‌లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ అప్పట్లో టాప్‌ స్టార్స్‌ అందరితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. 2012 వరకు వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి రెడీ అవుతున్న గ్లామర్‌ సునామీ.. కొత్త తరహా పాత్రలతో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.

90వ దశకంలో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన రంభ.. నటనతో పాటు డ్యాన్స్‌తో ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. అందుకే దాదాపు దశాబ్దం పాటు సిల్వర్‌ స్క్రీన్‌ని రూల్ చేశారు. అప్పట్లో టాప్‌ స్టార్స్‌గా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌తో పాటు జగపతిబాబు, జేడీ చక్రవర్తి లాంటి హీరోలతోనూ వరుస సినిమాలు చేసేసి స్టార్‌ ఇమేజ్‌ దక్కించుకున్నారు.

2000 తర్వాత టాలీవుడ్‌ మీద ఫోకస్ తగ్గించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో ఫామ్‌ చూపించారు. 2010లో పెళ్లి చేసుకున్న రంభ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు. ఆ తర్వాత అడపాదడపా బుల్లితెర మీద కనిపించినా.. సినిమాల్లో మళ్లీ ఫామ్‌ చూపించలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు రంభ.

రంభకు ముగ్గురు పిల్లలు. పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడంతో ఇప్పుడు మళ్లీ కెరీర్‌ మీద ఫోకస్‌ చేస్తున్నారు రంభ. నటిగా కొత్త తరహా పాత్రలు చేయాలని ఉంది అంటున్న ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని కన్‌ఫామ్‌ చేశారు. రీ ఎంట్రీలో రంభ ఎలాంటి క్యారెక్టర్లు సెలెక్ట్‌ చేసుకుంటారన్నదీ ఆసక్తికరంగా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్