హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల చేపట్టిన మహా ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల ధర్నాకు ఆటోలోనే వచ్చారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ఆటో డ్రైవర్లు ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఆవేనద వ్యక్తం చేశారు. గతంలో ఆటో డ్రైవర్లు 2 వేలు సంపాదించే వారని గుర్తు చేశారు. ఇప్పుడు 800 వందలు సంపాదిస్తున్నారని తెలిపారు. రవాణా సంక్షేమ బోర్డు, ఇన్స్యూరెన్స్ హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఏడాదికి ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల మహా ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి కేటిఆర్
0
143
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


