ఏపీ రాజకీయాలు ఆరోగ్యశ్రీ చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా ఆరోగ్యశ్రీ బకాయిలపై మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని.. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తుందని రజని తెలిపారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు.. టీడీపీ సర్కార్ ఉంచిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించామని గుర్తుచేశారు. ప్రస్తుతం వైసీపీపై కూటమి సర్కార్ పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విడుదల రజని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు సర్కార్ .. సాకులు వెతుకుతూ.. పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. జనవరి లోగా ఆస్పత్రులకు ఉన్న బకాయిలు చెల్లించాలని విడుదల రజని డిమాండ్ చేశారు.
వైసీపీ పాలనలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం- రజని
0
372
Previous article
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


