అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. పట్టణంలోని పాత గుంతకల్కు చెందిన పులికొండ తన భార్య సాయి తేజను హత్య చేశాడు. భర్త పులికొండ వైరుతో తల కోసుకుపోయే విధంగా గట్టిగా బిగించి హత్య చేశాడు. హత్య చేసి తన 8నెలల చిన్నారిని ఎత్తుకుని రాత్రి రెండు గంటల సమయంలో పరార్ అవుతుండగా వీధిలో పీర్ల ఉత్సవాల్లో పాల్గొన్న యువకులు పులికొండను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం సాయి తేజ గుత్తికి చెందిన పులికొండతో వివాహం జరిపించినట్లు మృతురాలు తండ్రి నారాయణస్వామి తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం
0
403
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


