అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. పట్టణంలోని పాత గుంతకల్కు చెందిన పులికొండ తన భార్య సాయి తేజను హత్య చేశాడు. భర్త పులికొండ వైరుతో తల కోసుకుపోయే విధంగా గట్టిగా బిగించి హత్య చేశాడు. హత్య చేసి తన 8నెలల చిన్నారిని ఎత్తుకుని రాత్రి రెండు గంటల సమయంలో పరార్ అవుతుండగా వీధిలో పీర్ల ఉత్సవాల్లో పాల్గొన్న యువకులు పులికొండను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం సాయి తేజ గుత్తికి చెందిన పులికొండతో వివాహం జరిపించినట్లు మృతురాలు తండ్రి నారాయణస్వామి తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం
0
390
Previous article
Latest Articles
టీడీపీలో సరికొత్తగా నారీ శకానికి నాంది
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన మహిళా సాధికారత వ్యూహానికి మహానాడు...
- Advertisement -
- Advertisement -


