తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనుంది. పశుసంవర్ధక మాజీ సీఈవో రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారించ నున్నారు. వీరిద్దిరికి ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈక్రమంలో అధికారులు వారిని ఇవాళ చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారిం చను న్నారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో 700కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుమారు పది మంది నిందితులను గుర్తించారు.


