దూసుకొస్తున్న రెమాల్ తుఫాన్

  బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో తీరం దాటనుంది.

మధ్య తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు తీవ్ర పీడనంగా మారింది. మరికొన్ని గంటల్లో ఈ ప్రాంతం తుఫాన్‌గా మారనుంది. తుఫాను ఏర్పడిన తర్వాత ఉత్తర దిశగా వేగంగా కదులుతుందని భారత వాతావర ణ శాఖ అంచనా వేసింది. ఆదివారం అంటే మే 26న తీవ్ర తుఫానుగా మారనుంది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్ వరకు విస్తరించవచ్చని ఐఎండీ అంచనా వేసింది. మే 26 రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ బీచ్‌లను తాకవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగం తో తీరం దాటుతుంది. ఇది గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. రెమాల్ తుఫాను మధ్య-తూర్పు బంగాళాఖాతంపై కదులుతున్న దృష్ట్యా, కోల్‌కతాతో సహా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో మే 26 మధ్యాహ్నం 12 నుండి మే 27 ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. కోల్‌కతాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తుఫాను తీవ్రత దృష్ట్యా, కోల్‌కతా శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో అన్ని కార్గో , కంటైనర్ నిర్వహణ కూడా ఆదివారం సాయంత్రం నుండి 12 గంటల పాటు నిలిపివేయబడింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కో వడానికి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పోర్టు చైర్‌పర్సన్ రథేంద్ర రామన్ శనివారం సమావేశం నిర్వహించారు. పోర్టు అధికారులతో జరిగిన సమావేశంలో చురుకైన చర్యలు, శాఖల మధ్య సహకారంపై ఆయన నొక్కి చెప్పారు. ఈ సమయంలో ఓడరేవు ప్రాంతంలో రైల్వే కార్యకలాపాలు కూడా నిలిపివేయబడతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం ఆదివారం రాత్రికి సమీపంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ శనివారం సాయంత్రానికి తుఫానుగా మారి మే 26 రాత్రికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో తీరం దాటుతుంది. ఇది గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. మే 26 నుంచి 27 వరకు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మే 27 నుండి 28 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాను వచ్చే సమయంలో సముద్రంలో 1.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందన్నారు.

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్