మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాపై పార్టీల అధినేతలు దృష్టి సారించారు. సీఎం జగన్, జనసేన అధినేత పవన్ ఈ జిల్లాలోనే లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు చివరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాకినాడ జిల్లాపై వైసీపీ, జనసేన అధినేతలు దృష్టి కేంద్రీకరించి ఆధి పత్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి చివరి పంచ్ ఎవరికి తగలనుంది..? ప్రజలు ఎవరికి మేలు చేయనునన్నారు అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.


