వైసీపీ నేత ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై వైసీపీ నేత ముద్రగడ స్పందించారు. కొందరు వ్యక్తులు తన కూతురితో తిట్టించారని అన్నారు. ఇది చాలా బాధాకరం అని చెప్పారు. కూతురుకు పెళ్లి అయిపోయిందని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ అని తెలిపారు. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే అని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మ నాభం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమనే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు. పిఠాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్బంగా ముద్రగడ చంద్రబాబు, పవన్ లపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మాటలను, హామీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక, పవన్‌ హైదరాబాద్‌కే పరిమితమయ్యే వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. ముఖానికి రంగులు వేసుకుని పవన్‌ వస్తున్నాడని విమర్శించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్