భానుడి భగభగలు … జనం విలవిలలు

తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. నిప్పుల కుంపటిని తలపిస్తున్న వాతావరణంతో జనం అల్లాడుతున్నారు. తెలంగాణ పలు చోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. జగిత్యాల, నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, కరీంనగర్‌ జిల్లా కొత్తగట్టులో 46, సిద్ధిపేట జిల్లా దూల్మిట్టలో 45.9, మంచిర్యాల జిల్లా జన్నారంలో 45.7, ములుగు జిల్లా మల్లూరులో 45.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సమయానికి కొన్ని ప్రాంతాల్లో..ఐదు నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది.మే నెలలో 48 నుంచి 49డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారంపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులకు ఎనిమిది మంది మృతిచెందారు. రోజురోజుకు పెరిగిన ఉష్ణోగ్రతలతో పగలు, రాత్రి వాతావరణం వేడిగా ఉంటోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్