ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులను నమోదు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీరామ నవమి ఫ్లెక్సీలపై శ్రీరాముడి చిత్రంతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫొటోను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ముద్రించారని VST అధికారులు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఎమ్మెల్యే శంకర్ పై కేసు నమోదైంది. కాగా శ్రీరామ నవమి రోజు శోభాయాత్రలో ఎమ్మెల్యే శంకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పాల్గొని నినాదాలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని VST అధికారులు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్ పై కోడ్ ఉల్లంఘన కేసులు
0
332
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


