సిద్దిపేట జిల్లాలో చిరుతను చంపి జైలుపాలయ్యారు వేటగాళ్లు. దౌల్తాబాద్కు చెందిన నలుగురు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఉచ్చు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఉచ్చులో చిరుత చిక్కడంతో పంట పండిందని భావించారు. చిరుతను కొట్టి చంపి దంతాలు, చర్మం అమ్మి సొమ్ము చేసుకోవచ్చని ఆశ పడ్డారు. దీంతో చిరుతను కొట్టి చంపి దహనం చేశారు. అయితే, విషయం బయటకు పొక్కడంతో పోలీసుల చేతికి చిక్కారు. వన్య ప్రాణులను వేటాడటం నేరం కావడంతో నలుగురు వేటగాళ్లైన సాయి కుమార్, ఎల్లం, రాములు, నరసింహులుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డ కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు అడవి శాఖ అధికారి డిఎఫ్ఓ శ్రీనివాస్.
సిద్దిపేట జిల్లాలో చిరుతను చంపిన వేటగాళ్లు
0
247
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


