హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీని కల్పించింది. మాధవీలతకు ముప్పు ఉందని నిఘా వర్గాలకు కేంద్రానికి సమాచారం ఇవ్వ డంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది పహారా కాస్తారు. ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా,.. మరో ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉంటారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పిస్తోంది.


