నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఓ మంచినీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హిల్కాలనీ విజయవిహార్ సమీపంలోని సుమారు రెండు వందల నివాస గృహాలకు తాగునీటి కోసం NSP నీటి సరఫరా విభాగం ట్యాంకును నిర్మించింది. దాహం తీర్చుకోవటానికి ఈ ట్యాంకు వద్దకు వచ్చిన కోతులు అందులోకి దిగాయి. బయటికి రావటానికి అవకాశం లేకపోవటంతో మృత్యువాత పడ్డాయి. ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారమిచ్చారు. సుమారు 30 కోతుల వరకు బయటకు తీశారు. ఇన్ని రోజులూ ఆ నీటినే తాగమని, అనారోగ్యానికి గురవుతామేమోనని కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ సిబ్బందికి ఉన్నా.. ఏనాడూ అలాంటి చర్యలు నిర్వహించలేదని స్థానికులు ఆరోపించారు.
నీటి ట్యాంకులో పడి 30 వానరాల మృతి
0
274
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


