24.7 C
Hyderabad
Saturday, May 10, 2025
spot_img

లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ సరికొత్త వ్యూహాలు

      లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకువెళ్తోంది. మరో రెండు నెలల్లో సార్వత్రిక సమరం మొదలు కానుండడంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం గెలుపు గుర్రా లను రెడీ చేస్తోంది. ఈసారి సాధ్యమైనంత త్వరగా..లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజాము వరకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సహా పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ హాజరయ్యారు.

     దేశంలోని 550కిపైగా లోక్‌సభ స్థానాల కోసం ముగ్గురు చొప్పున అత్యుత్తమ అభ్యర్థుల పేర్లతో రూపొందించిన లిస్టుపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. తొలి విడతగా నేడో రేపో లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు అయినట్లు తెలుస్తోం ది. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకె అరుణ, కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థులుగా దాదాపు ఖరారు అయినట్లు టాక్ వినిపి స్తోంది. అయితే మార్చి 10లోగా 50 శాతానికిపైగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది.

     వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అందరూ ఊహించినట్లుగానే ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే అధిష్టానం మళ్లీ అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్‌ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కానట్లు తెలుస్తోంది. నాలుగైదు స్థానాల్లో ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నా.. పోటీ చేయబోయే అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేశారని సమాచారం. అలాగే పంజాబ్‌లో అకాలీదళ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన, తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు చర్చలు జరిగాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్