ఝార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ చేరింది. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. తమకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చంపై సోరెన్ అంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు శామిర్ పేట్లోని లియోని రిసార్టుకు చేరుకుంటున్నారు. బల నిరూపణ వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈ నెల 5న ఝార్ఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ జరగనుంది. బలనిరూపణకు ముందు అప్రమత్తమైన జేఎంఎం, కాంగ్రెస్ కూటమి.. ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలించింది. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల కోసం రెండు హోటల్స్ బుక్ చేసిన టీపీసీసీ.. అసెంబ్లీలో బలనిరూపణ వరకు హైదరాబాద్లోనే ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉండేలా ప్లాన్ చేసింది. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతలను తెలంగాణ మంత్రి పొన్నం చూస్తున్నారు.
హైదరాబాద్కు చేరిన ఝార్ఖండ్ రాజకీయం
0
755
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


