26.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

ధర్మపురిలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ

స్వతంత్ర వెబ్ డెస్క్: ధర్మపురిలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. 2PMకి ప్రత్యేక హెలికాప్టర్ లో కేసీఆర్ ధర్మపురి చేరుకుంటారు. ఇప్పటికే మంత్రి కొప్పుల ఈశ్వర్ దగ్గర ఉండి ఏర్పాట్లు పూర్తి చేయించారు. నియోజకవర్గ పరిధి 6 మండలాల నుంచి 50 వేల మందిని సభకు తరలించేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. హెలిప్యాడ్, విఐపి పార్కింగ్ వద్ద నిగా పెట్టారు. అలాగే.. నిర్మల్‌ జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో కూడా ఇవాళ సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఇక అటు నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువకుండా ఎవడూ ఆపలేడన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదని చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్