మీకు అంతకుమించి ఏమి ఇవ్వలేం- నవీన్ పోలిశెట్టి

స్వతంత్ర వెబ్ డెస్క్: తన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (‘Miss Shetty Mr Polishetty’) చిత్రీకరణకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అధికసమయం పట్టినందుకు తనను క్షమించాలని చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) అభిమానులను కోరాడు. చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సిన సినిమా విషయంలో జాప్యం జరిగిందని అభిమానులు భావిస్తుండడంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు మాపై చూపించే ప్రేమకు మంచి సినిమా తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులు చూడదగ్గ మూవీ. సోమవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి’’ అని నవీన్ తెలిపారు.

 

 

పి.మహేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందంతో పాటూ హీరో నవీన్ పలు నగరాలు సందర్శించి అక్కడి అభిమానులను కలుసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో చిత్ర బృందం ‘మీట్ అండ్ గ్రీట్’ నిర్వహించింది. ఈ సందర్భంగా నవీన్ తనదైన శైలిలో కామెడీ పండిస్తూ అభిమానులను అలరించాడు. సినిమా విడుదలలో జాప్యం జరిగినందుకు మన్నించాలని కూడా కోరారు. నవీన్ పోలిశెట్టి చివరి చిత్రం ‘జాతిరత్నాలు’ 2021లో విడుదలైంది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్