33.2 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

ఆమె కాంగ్రెస్‌లో చేరితే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు- భట్టి విక్రమార్క

స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీలో చేరితే సొంతింటికి వచ్చినట్లుగా భావిస్తామని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తన పాదయాత్ర విజయవంతం కావడంతో తనకు సహకరించిన వారితో కలిసి ఆయన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఎవరికీ అభ్యంతరాలు ఉండవని,ఆమె సొంతింటికి వచ్చినట్లుగా భావిస్తామని అన్నారు.

వైఎస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబమే అన్నారు. ఇటీవలే షర్మిల తమ పార్టీ పెద్దలను కలిశారని గుర్తు చేశారు. కొద్దిగా భావోద్వేగాల వల్ల కొంతకాలం వారు పార్టీకి దూరంగా ఉన్నారన్నారు. నిన్న ఇడుపులపాయలోనూ మల్లు భట్టి స్పందించారు. షర్మిల పార్టీలోకి వస్తే ఆహ్వానించాల్సిందే అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన జీవితం మొత్తం కాంగ్రెస్‌కు ధారపోశారన్నారు. అలాంటి నాయకుడి బిడ్డ తమ పార్టీలోకి వస్తే మంచి పరిణామమే అన్నారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్