స్వతంత్ర వెబ్ డెస్క్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాల విద్యాశాఖ 502 టీచర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు ఉన్నాయి. మోడల్ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేస్తారు. మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ లో భర్తీ చేయనున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 81 పోస్టులు కూడా ఉన్నాయి. డీఎస్సీలో(Dsc) టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. పోస్టులకు అప్లై చేసుకునేవారు.. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఫీజు చెల్లింపు చేయాలి. ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 23న పరీక్ష, నవంబర్ 4న ఫలితాలు వెల్లడించనున్నట్టుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.