స్వతంత్ర వెబ్ డెస్క్: గాయం కారణంగా 11 నెలలు క్రికెట్కు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah).. రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. పసికూన ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్(Ireland T20 Series) నేటి నుంచే ప్రారంభంకానుంది. ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపికైన బుమ్రా.. జట్టును ముందుండి నడిపించడనున్నాడు. విండీస్తో ఆడిన జట్టులో సంజూ శాంసన్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్టోయ్, ముఖేష్ కుమార్తోపాటు ఐపీఎల్(IPL) స్టార్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అందరీ కళ్లు బుమ్రాపైనే ఉన్నాయి. ప్రపంచకప్కు ముందు బుమ్రా పూర్తి ఫిట్నెస్తో రెడీ అయితే భారత్ మరింత పటిష్టంగా మారుతుంది. డబ్లిన్లోని ది విలేజ్ వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.