స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆగస్ట్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. ఎయిమ్స్ నాలుగో అంతస్తుల నుంచి మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులోని ఎండోస్కోపిక్ ఎమర్జెన్సీ వార్డులో మొదటగా మంటలు వచ్చాయి. ఆ వెంటనే దట్టమైన పొగలు కమ్మేశాయి. నాలుగో అంతస్తు నుంచి దట్టమైన పొగలు రావటంతో.. మంటలు వ్యాపించటంతో.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్లు అందర్నీ బయటకు తీసుకొచ్చారు వైద్య సిబ్బంది. ఇదే సమయంలో బిల్డింగ్ లో మంటలు రావటాన్ని చూసిన మిగతా రోగులు, వారి బంధువులు, ఆస్పత్రికి వచ్చిన ఇతర రోగులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి. ఆరు ఫైరింజన్లతోపాటు.. పెద్ద ఎత్తున ఫైర్, పోలీస్ సిబ్బంది ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నాయి. ఆందోళనలో ఉన్న రోగులను సముదాయిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని ప్రకటించింది ఎయిమ్స్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చాయని చెబుతున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం.. ఆందోళనలో పేషెంట్లు
0
295
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


