స్వతంత్ర, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు అయ్యింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసుకు సంభందించి హైకోర్టులో సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రశ్నపత్రాల లీక్లో రూ.1.63 కోట్ల లావాదేవీలు గుర్తించామని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంభందించి ఇప్పటి వరకు 49 మంది అరెస్టు చేశామని తెలిపారు.అలాగే ఈ కేసులో 16 మంది మధ్యవర్తులు ఉన్నారని తెలిపారు. మరో నిందితుడు ప్రశాంత్రెడ్డి న్యూజిలాండ్లో ఉన్నట్లు కోర్టుకు వివరించారు.


