29.1 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

తరుణ్ ఛుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ మేరకు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తరుణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో కుటుంబ పాలనా, వంచన పాలనా, అవినీతి పాలనే నడిచిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపై విసుగెత్తి ఉన్నారని.. ఇప్పడు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అటు కాంగ్రేస్ మీద విరుచుకుపడుతూ.. కేసీఆర్ కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కేసీఆర్.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాని అన్నారు.

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని.. ఈ క్రమంలో లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అవినీతిపాలనాను మోడీ నేతృత్వంలో అంతమొందిస్తామన్న తరుణ్.. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని అన్నారు. స్వచ్ఛమైన తెలంగాణబిడ్డ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీ లో చేరారని.. రాకేష్ రెడ్డిని బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్