స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఈ-రిక్షా బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందిన ఘటన ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో జరిగింది. బారాబంకీ బీబీడీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న అంకిత్ కుమార్ గోస్వామికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు అక్కడే తన కోడలితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ప్రతిరోజు ఈ రిక్షా నడుపుతూ జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాను నడుపుకుంటున్న ఈరిక్షా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి ఇంటి పనులు చూసుకుంటున్నాడు. దీంతో ఒక్కసారిగా ఈరిక్షా బ్యాటరీ పేలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే క్రమంలో ముగ్గురు చిన్నారులు మరణించగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.