స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గ్రూప్-4 అభ్యర్ధులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు ఈనెల 9 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ గడువు ముగిసిన అనంతరం మరోసారి తప్పుల సవరణకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8,180 గ్రూప్4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జులై 1న ఈ పరీక్ష జరగనుంది. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలని అభ్యర్థులు ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. మరోవైపు పీఈసెట్ దరఖాస్తుల గడువును కూడా పొడిగిస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ఫైన్ లేకుండా ఈనెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
గ్రూప్4 అభ్యర్ధులకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన TSPSC
0
346
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


