ఐపీఎల్ లీగ్ ముగియగానే.. మరో మెగా టోర్నీకి భారత ఆటగాళ్లు సిద్ధం కానున్నారు. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య వర్డల్ టెస్టు చాంపియన్ షిప్(WTC) ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ మేరకు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులోకి సీనియర్ ఆటగాడు రహానేను ఎంపిక చేయడం విశేషం. ఈ ఐపీఎల్ లో అద్భుత ఫాంతో రెచ్చిపోతున్న రహానేను తిరిగి భారత జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. అయితే మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెట్టారు. ఇక తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ కు వికెట్ కీపర్ గా చోటు కల్పించారు. మొత్తం 15మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
WTC ఫైనల్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, అంజిక్యా రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(WK), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.